మల్లన్న హుండీ ఆదాయం రూ. 4 కోట్లు : ఆలయ ఇఒ డి పెద్దిరాజు

Sep 26,2024 22:02

ప్రజాశక్తి – శ్రీశైలం

శ్రీశైలం మల్లన్న హుండీకి ఆగస్టు 22 నుండి సెప్టెంబర్‌ 25 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4కోట్ల ఆధాయం సమకూరినట్లు ఆలయ ఇఒ డి పెద్దిరాజు తెలిపారు. శ్రీశైలం హుండీని గురువారం లెక్కించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా… శ్రీశైలంలో హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 4,00,65,375/- నగదు వచ్చిందన్నారు. ఆలయ హుండీల ద్వారా రూ.3,86,82,321/-లు, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 13,83,054/ కలిపి మొత్తం రూ 4,00,65,375/లను భక్తులు 35 రోజుల్లో సమర్పించినట్లు తెలిపారు. అదేవిధంగా 488 – యుఎస్పి డాలర్లు, 12 – కువైట్స్‌ దినార్స్‌, 6000- ఉగాండా షిలింగ్స్‌, 30 – యుకే పౌండ్సు, 60- సింగపూర్‌ డాలర్లు, 20 హంకాంగ్‌ డాలర్లు, 10 ఈరోస్‌, 20 – మలేషియా రింగిట్స్‌ మొదలైన విదేశీ కరెన్సీలు హుండీల లెక్కింపులో లభించాయన్నారు. సీసీ కెమెరాల నిఘాతో హుడీలు లెక్కించినట్లు తెలిపారు. కార్యక్రమములో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ ఆర్‌. రమణమ్మ, పలు విభాగాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️