మానవత్వం చాటుకున్న రూరల్ కోఆర్డినేటర్ చందన

Nov 22,2023 16:29 #East Godavari

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్(తూగో): ధవలేశ్వరంలోని స్థానిక గొల్లపేట నందు నివాసం ఉంటున్న పిట్ల. రాజు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పక్షవాతం రావడంతో ఆటో నడపలేక కుటుంబ పోషణ భారం అవడంతో సామాజిక పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నాడు. కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వరరావు కలిసి పెన్షన్ వచ్చే వరకు ఆర్థిక సహాయం చేయమని కోరడంతో రూరల్ కోఆర్డినేటర్ చందన మానవత్వంతో ప్రతినెల పెన్షన్ వచ్చే వరకు మూడు వేల రూపాయలను ఇస్తానని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకుంటూ ఈరోజు 3 వేల రూపాయలను చందన.నాగేశ్వర్ ధవలేశ్వరం గొల్లపేట నాయకులతో ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాధనాల. చంద్రశేఖర్ (శివ), వైఎస్ఆర్సిపి వికలాంగుల అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్, కన్వీనర్ బర్రె.కామేశ్వరరావు, ముత్యాల జాన్, ముద్దాడ. బాబి వైవి సత్యనారాయణ, ఇందల. శ్రీనివాస్, సుంకర. నారాయణ, జొన్నాడ జయదేవ్, ముత్యాలు, వాలంటీర్ భాష తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️