పారిశుధ్యం మెరుగుపడాలి

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ భాగ్యలక్ష్మి

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ భాగ్యలక్ష్మి

క్లాప్‌ కలెక్షన్స్‌, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయాలి

            అనంతపురం కార్పొరేషన్‌ : ‘నగరంలో ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తోంది.. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.. క్రమం తప్పకుండా ఇంటింటి చెత్త సేకరణ చేపట్ట పారిశుధ్యం మెరుగుర్చాలి’ అంటూ కమిషనర్‌ భాగ్యలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కౌన్సిల్‌ హాలులో శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణకు క్లాప్‌ వసూళ్లు చేయాలన్నారు. అలాగే ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుల వసూళ్లను వేగవంతం చేయాలని, లేకుంటే శానిటరీ ఇన్స్‌పెక్టర్లకు మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. అలాగే శానిటరీ ఇన్స్‌పెక్టర్లు పారిశుధ్యం మెరుగుపరిచే విషయంలో, క్లాప్‌ వసూళ్ల లక్ష్యంలో అశ్రద్ధ వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పారిశుధ్య పరిస్థితులు మెరుగు పడుకుంటే శానిటరీ ఇన్స్‌పెక్టర్ల పర్యవేక్షణ అధికారి కార్యదర్శి సంఘం శ్రీనివాసులకు సైతం మెమో జారీ చేస్తామని స్పష్టం చేశారు. చెత్తకుండీల వద్ద చెత్త తొలగించిన తర్వాత దుర్గంధం వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్‌, సున్నం కలిపి చల్లాలన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంఘం శ్రీనివాసులు, ఇఇ సూర్యనారాయణ పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️