హార్శిలీహిల్స్ లో ఓటరు జాబితా క్యాంపెయిన్

Dec 2,2023 13:22 #Annamayya district
vote registration in b kottakota

వీఆర్వో నరేంద్ర వెల్లడి
ప్రజాశక్తి – బి.కొత్తకోట : రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టే ఉద్దేశంతో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసింది. శనివారం మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్శిలీహిల్స్ నందు పోలింగ్ స్టేషన్ – 200 పరిధిలోని ఓటరు జాబితాను వీఆర్వో నరేంద్ర పరిశీలించారు. ఇందులో భాగంగా ఓటర్ల నుండి అభ్యంతరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్వో నరేంద్ర మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే ఓటర్లు బిఎల్ఓలను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. చిరునామా, ఇంటి పేరు మార్చుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తాజా వార్తలు

➡️