రేపు విదేశీ శాస్త్రవేత్తల పర్యటన

Nov 26,2023 11:17 #foreign, #scientists, #tomorrow, #Visit

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అమలవుతోన్న ప్రకృతి వ్యవసాయంపై పరిశీలన చేసేందుకు 27, 28 తేదీల్లో విదేశీ రైతు శాస్త్రవేత్తల బృందం రానుందని రైతు సాధికార సంస్థ పేర్కొంది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ బృందం రాయలసీమ పరిధిలోని చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పర్యటించనుందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ విజయకుమార్‌ తెలిపారు. కెన్యా, జింబాబ్వే, సెనెగల్‌, బుర్కినాఫాసో, ట్యునీషియా, పెరూ దేశాలకు చెందిన పర్యావరణ వేత్తలు ఈ బృందంలో ఉన్నారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

➡️