తెనాలిలో నలుగురు చిన్నారులు అదృశ్యం

children missing case

వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు
ప్రజాశక్తి-తెనాలి : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నలుగురు పిల్లలు అదృశ్యం కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం చినరావూరు తోట పోతురాజు కాలనీలో నివాసం ఉండే పంది మాల్యాద్రి, సుమలత దంపతుల కుమార్తె రాధిక (13), కుమారుడు రాఘవేంద్ర (8) అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు ఇరువురు ఉదయం రూరల్ గ్రామం కొలకలూరు కూలీ నిమిత్తం వెళ్లారు తిరిగి వచ్చేసరికి పిల్లలు ఇరువురు కనిపించలేదు. మాల్యాద్రి దంపతులు ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందినవారు. ఆరు నెలల క్రితం కూలి పనులకు వచ్చి పోతురాజు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా 14వ వార్డు చినరావూరు తోట స్మశానం రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ జానీ కుమారుడు అల్తాఫ్ (9), షేక్ బాషా కుమారుడు ఆరిఫ్ (7) కూడా అదృశ్యమయ్యారు. బాలురు అదే ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలో ఒకరు, ప్రభుత్వ పాఠశాలలో ఒకరు చదువుతున్నట్లు సమాచారం. ఒకే ప్రాంతంలో ఒకేరోజు నలుగురు పిల్లలు అదృశ్యం కావడం పట్టణంలో కలకలం రేపింది. పిల్లల కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

తాజా వార్తలు

➡️