ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం

delhi-bihar-train-bogies-catch-fire-uttar-pradesh-etawah

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న వైశాలి ఎక్స్‌ప్రెస్ లోని ఎస్6 కోచ్ బోగీలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 11 మంది ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ కాలేజీకి, ఎనిమిది మంది ప్రయాణికులు ప్రధాన కార్యాలయంలోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభుత్వ ఉమ్మడి ఆసుపత్రిలో చేరారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే ఇటావాలో బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి దర్భంగా వెళ్తున్న రైలులోని మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. వీటిలో ఒక స్లీపర్ కోచ్, రెండు జనరల్ బోగీలు ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. 12 గంటల్లోనే రెండు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

➡️