జగన్‌ పై కృతజ్ఞతభావం ప్రజల్లో స్పష్టంగా ఉంది : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

Nov 28,2023 13:01 #cm jagan, #MLA, #programme

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఏ గడపను తొక్కినా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్ల కృతజ్ఞతా భావం ప్రజల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండలంలోని చొప్పెల్ల సచివాలయం-1లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ దంగేటి చంద్రకళ బాపనయ్య అధ్యక్షతన వైసీపీ మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాసు, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పిటిసి సభ్యులు తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, ఏఎంసి చైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు, పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తిరుగుతూ వివరించారు. రాష్ట్రంలో వైయస్సార్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకే చేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనన్నారు. ప్రజలు వైయస్సార్‌ ప్రభుత్వ హయాంలో అధికారులతో సుపరిపాలన కొనసాగాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర ఏళ్ళుగా ఎన్నో అభివఅద్ధి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ఒక్క వైసిపి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. పేద ప్రజల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దానికి అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చాయన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను కాకుండా ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కటి అందించాలన్న గొప్ప మనసున్న వ్యక్తిని వచ్చే ఎన్నికలలో మరోసారి వైయస్సార్‌ ప్రభంజనం ఉంటుందన్నారు. అందుకు ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి తమ ఓటుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కర్రి నాగిరెడ్డి, జాంపోలు మాణిక్యం, వాసన రాజు, దియ్యన పెద్దకాపు, ఉప సర్పంచ్‌ తోరాటి దుర్గారావు, ఎంపీడీవో జాన్‌ లింకన్‌, పంచాయతీ కార్యదర్శి ఎం.శ్యామ్‌ సుందర్‌, సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడిలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️