వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ

Nov 18,2023 12:40 #garbini death, #prakasam

ప్రజాశక్తి – అద్దంకి : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొద్ది రోజుల క్రిందట  కాన్పు కోసం వచ్చి వైద్యులు నిర్లక్ష్యం కారణంగా మిర్చి రాణి మృతి చెందిందని బాధిత కుటుంబీకులు ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. కలెక్టర్‌ ఆదేశాలతో చీరాల ఆర్డీఒ సరోజనమ్మ, డిఎంహెచ్ఈఓ విజయమ్మ, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలతో పాటు వైద్య సిబ్బందిని విచారించారు. ఘటన ఏ విధంగా జరిగిందో వివరాలను అడిగి తెలుసుకున్నారు. విచారణలో వచ్చిన వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
వైద్య అధికారినిపై ఫిర్యాదు
సామాజిక ఆరోగ్య కేంద్ర అధికారిని ఇష్టారీతిని ఆశాలను, ఏఎన్ఎంలను  దుర్భాషలాడుతుందని, ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు డిఎంహెచ్ఇఓ, ఆర్డిఓలకు వినతి పత్రం శుక్రవారం అందించారు.

తాజా వార్తలు

➡️