అన్నవరం హుండీల ఆదాయం 1.81 కోట్లు

Nov 29,2023 16:16 #Kakinada
hundy count in annavaram

ప్రజాశక్తి-అన్నవరం : అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి హుండీల ద్వారా 1,81,26,154/ రూపాయలు ఆదాయం లభించింది. బుధవారం కొండపైన దేవస్థానం ఈవో కే రామచంద్ర మోహన్ మరియు చైర్మన్ రాజా ఐవి రోహిత్ సమక్షంలో దేవస్థానం అధికారులు 29 రోజుల్లో వివిధ హుండీలలో వేసిన భక్తుల కానుకలను లెక్కించారు. ఈ లెక్కింపులో నగదుతో పాటుగా 42 గ్రాములు బంగారం 976 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు అకౌంట్స్ విభాగం పర్యవేక్షణ అధికారి అనకాపల్లి ప్రసాద్ ప్రజాశక్తికి తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు వివిధ విభాగాలు ఏఈవోలు ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ అధికారులు, వ్రత పురోహితులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️