ముగిసిన కులగుణన శిక్షణ తరగతులు

Nov 21,2023 19:45 #Nellore District

ప్రజాశక్తి-ఉదయగిరి:రెండు రోజులు పాటు జరిగిన కులగుణన శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకి కులగుణ న శిక్షణ తరగతులతో చేపట్టిన సర్వేపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఈశ్వరమ్మ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబం పూర్తి వివరాలు తెలుసుకుని ఈ యాప్‌ లో పొందుపరచాలన్నారు. కార్యక్రమం నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 3 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు. ఈ ఓటింగ్‌ ఎక్కువ శాతం బయోమెట్రిక్‌ ద్వారానే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎవరు స్క్రీన్‌ షాట్‌ గాని వీడియోస్‌ గాని తీయకూడదన్నారు. ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు తంబు వేయాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️