యోగ భారత్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

Nov 30,2023 13:02 #Kakinada
bharat yoga foundation state committee elected

ప్రజాశక్తి-శంకవరం : నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏ రకమైన ఔషధం లేకుండా తనకు తానుగా ఆరోగ్యాన్ని వ్యాయామ సాధన ద్వారా సంరక్షించుకునే విధానమే యోగ. అటువంటి యోగాను అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో యోగ భారత్
ఫౌండేషన్ ను ప్రముఖ యోగ గురువు జ్యోతుల నాగేశ్వరరావు స్థాపించారు. ఈ నేపథ్యంలో యోగాను గ్రామీణ ప్రాంతాలలో కూడా సాధన చేసే విధంగా ప్రోత్సాహిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త జ్యోతుల శ్రీనివాస్ ను యోగ భారత్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షునిగానూ,
సామాజిక కార్యకర్త మేకల కృష్ణ కార్యదర్శిగాను నియమితులయ్యారు. యోగ భారత్ ఫౌండేషన్ గత 15ఏళ్ళుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జ్యోతుల శ్రీనివాస్ ఆర్ధిక సహాయంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. కరోనా కాలంలో యోగ శిక్షణ తరగతులను ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ జ్యోతుల నాగేశ్వరరావు జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. వీరు నిర్వహిస్తున్న సేవలను గుర్తించి, వీరిని నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

➡️