మహాపడావ్‌ ధర్నా కరపత్రాల ఆవిష్కరణ

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షకుల పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ విజయవాడలో ఈనెల 27, 28 తేదీలలో జరిగే మహా పడావ్‌ ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సిఐ టియు జిల్లా కార్యాలయంలో బుధవారం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు ఒంగోలు నగర కార్యదర్శి తంగిరాల మహేష్‌, నగర అధ్యక్షులు సిహెచ్‌ రాంబాబు, నగర ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులు, ఎస్‌డి హుస్సేన్‌ పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️