చర్మకారుల సమస్యలపై గవర్నర్‌ కు వినతి

Nov 29,2023 22:45 #andhrapradesh, #Governor

మంగళగిరి: విజయవాడ రాజ్‌ భవన్‌ లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను బుధవారం రాష్ట్ర చర్మకార సేవా సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు కలిసి రాష్ట్రంలో చర్మకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. లిడ్‌ క్యాప్‌ సంస్థకు రూ. 128 కోట్ల గాంట్‌ ఇవ్వాలని, లిడ్‌ క్యాప్‌ లో 300 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, మంగళగిరి నియోజక వర్గంలోని డప్పు కళాకారులకు, చర్మకారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రుణాలు ప్రభుత్వం నుండి మం జూరు చేయించాలని తదితర సమస్యలను ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. గవ ర్నర్‌ను కలిసిన వారిలో సంఘం కార్యదర్శి డి. నాగయ్య, సం ఘం నాయకులు వై.సుశీల, జి .సౌజన్య, కె.రాణి ఉన్నారు.

తాజా వార్తలు

➡️