వైసిపిలోకి జనసేన సందీప్‌

Nov 23,2023 08:36 #JanaSena, #Join Another Party, #YCP

సజ్జల సమక్షంలో పార్టీలో చేరిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పసుపులేటి సందీప్‌, రాయలసీమ రీజియన్‌ ఇన్‌ఛార్జి పద్మావతి జనసేనకు రాజీనామా చేసి వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వారు బుధవారం పార్టీలో చేరారు. పవన్‌కల్యాణ్‌ తన స్వార్థం కోసం ఎంతోమందిని బలిచేస్తున్నారని సందీప్‌ పేర్కొన్నారు. తమ కుటుంబం ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుండి పవన్‌కల్యాణ్‌తో వుందని, ఆయన స్వార్థ రాజకీయాలు తెలుసుకునే బయటకు వచ్చామన్నారు. సిఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గొప్పగా వున్నందునే వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

తాజా వార్తలు

➡️