ర్రాష్ట్రస్థాయి పోటీలకు కీడాకారుల పయనం

Nov 18,2023 13:18 #srikakulam

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 18,19 తేదీల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని ఒలింపిక్‌ అసోసియేషన్‌ సలహాదారు పి.సుందరరావు పిలుపు నిచ్చారు. పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి శుక్రవారం పయనమయ్యారు. వీరికి నగరంలోని పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న జిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. క్రీడా స్ఫూర్తినితో క్రమశిక్షణగా ఆడి, పట్టుదల, అంకితభావంతో తుదివరకు పోరాడాలని సూచించారు. జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి మాట్లాడుతూ ప్రత్యర్థుల క్రీడా ప్రతిభను అంచనా వేసుకుని పోటీల్లో పైచేయిగా నిలవాలన్నారు. తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ జిల్లా అధ్యక్షులు కొమర భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రపోటీల్లో జిల్లా నుంచి 28 మంది బాలబాలికలు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉషు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్‌, ఇస్కాఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు, జిల్లా తైక్వాండో బృందానికి కోచ్‌ మేనేజర్లుగా కురిటి తారకరామా, లక్ష్మణరావు, ముద్దాడ శిరీష పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️