ప్లాస్టిక్ కంపెనీలో హత్య

Nov 18,2023 11:40 #Crimes in AP, #Murder, #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట: స్థానిక వీటి అగ్రహారం 35వ డివిజన్ పరిధిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ కంపెనీలో అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. శనివారం నాడు స్థానిక వీటి అగ్రహారంలో ఒక ప్రైవేట్ ప్లాస్టిక్ కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి మర్డర్ జరిగినట్లు గుర్తించిన రూరల్ పోలీసులు. వివరాలకు వెళ్తే స్థానిక బంటుపల్లి అప్పలనాయుడు సన్ ఆఫ్ అచ్చన్న 71సంవత్సరాలు కుమారుడు ప్లాస్టిక్ కంపెనీలో గత కొంతకాలంగా వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే శుక్రవారం నాడు రాత్రి అదే కంపెనీలో పనిచేస్తున్న బీహార్ ప్రాంతానికి చెందిన కొనాల్ 35సంవత్సరాలు అనే వ్యక్తి సుమారు రాత్రి 9:30 ప్రాంతంలో మిషన్ కు ఉన్న కటింగ్ బ్లేడ్లు అమ్ముకోవడానికి బయటకు పట్టుకుని వెళ్తుంటే వాచ్మెన్ అయిన అప్పలనాయుడు పట్టుకొనగా ఆయన్ని కగుద్ది బ్లెడ్లు పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న ఇతర పనివాళ్ళు శ్రీను అదేవిధంగా పక్క కంపెనీలో ఉన్న వాచ్మెన్ కి చెప్పగా వారి సహాయంతో ఇంటికి కబురు చేస్తే వాళ్ళ భార్య పిల్లలు వచ్చి రక్తం కారుతూ ఉంటే కట్టుకట్టి ఆ కొనాల్ ని మరి నువ్వు ఏమి అనకు అని చెప్పి భార్య పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. అయితే తెల్లవారి శనివారం ఉదయం 6:00కి శ్రీను ఆయన పనివాడు వచ్చి గేట్లు కొడుతుంటే తలుపులు పోయేసరికి ఏమైందో అని చూద్దామని గోడదవోకి వచ్చి చూసేసరికి రక్తం మడుగుల్లో పడి ఉన్న అప్పలనాయుడు, వెంటనే ఆయన సహ ఉద్యోగులకి ఫోన్ చేసి చెప్పి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అదేవిధంగా పోలీస్ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది విని వెంటనే రూరల్ పోలీసులు వచ్చి బాడీని పరిశీలించి నమూనాలు సహకరించి పరీక్షలకు పంపించడం జరిగింది. బాడీని బయటికి తీసుకెళ్లకుండా భార్యాభర్తలతో పాటు స్థానికులు గేటు వద్ద అడ్డుకున్నారు. ఈ కంపెనీ ఓనర్లు గౌతం, రాము అందుబాటులో లేకపోవడంతో పోలీసు వారు వారికి ఫోన్ చేసి రమ్మని బాడీ దగ్గర ఉన్నారు. అప్పలనాయుడు బార్య యశోద, కుమారుడు తరుణ్ కలరు.

తాజా వార్తలు

➡️