భావనపాడు తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం

Nov 17,2023 14:42 #beach
భావనపాడు తీరానికి చేరిన భారీ తిమింగలం

ప్రజాశక్తి- నౌపడ(శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం భావనపాడు సముద్రతీరానికి శుక్రవారం ఉదయం భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. 15 మీటర్లు పొడవు, పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్రంలోనే మృతి చెంది ఒడ్డుకు చేరుకుందని మత్స్యకారులు తెలిపారు. విషయం తెలుసుకున్న పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు తిమింగలాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు.

తాజా వార్తలు

➡️