కబ్జాదారుల నుంచి మా భూములు కాపాడండి

Dec 1,2023 16:37 #Land Mafia, #Vizianagaram
save our lands from land mafia

మా భూములు మాకిప్పించండి
అమనాం గ్రామస్తులు ఎస్పీకి వేడుకలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా భోగాపురం మండలం, పోలిపల్లి గ్రామానికి ఆనుకొని సర్వే 27లో ఉన్న మా భూములను మాకు అప్పగించాలని అమనామ్ గ్రామానికి చెందిన తిరుమల రెడ్డి వెంకటరావు, తామడ గౌరీలు కోరారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన వాళ్ళ ఎస్పీకి తమ గోడును వినిపించేందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పొలిపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 27లో సుమారుగా 45 నుంచి 50 ఎకరాలు భూమి మా కుటుంబ సభ్యులకు,మాకు ఉందన్నారు. ఈ భూమి రికార్డులు తారుమారు చేసి భూమిని కొల్లగొట్టేందుకు కొంతమంది పెద్దలు రాజకీయ అండతో భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారన్నారు. అందుకు పోలిపాల్లి మాజీ సర్పంచ్ కర్రోతు సత్యన్నారాయణ సహకారంతో తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించి కబ్జా చేసేందుకు చూస్తున్నారన్నారు. ఇదే విషయంపై మాకు దగ్గర ఉన్న పక్కా ఆధారాలతో కోర్టు కెళ్ళడం జరిగిందన్నారు. కోర్టు భూమిపై తప్పుడు ఆధారాలతో ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. విచారణకు కూడా ఆదేశించడం జరిగిందన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా కర్రోతు.సత్యన్నారాయణ సుమారుగా మూడు ఎకరాలు భూమిలో అక్రమ కట్టడాలను పాల్పడుతున్నారని అన్నారు. వెంటనే ఎస్పీ కలుగుచేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. తమ భూములు లాగేసూ కునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తున్నారని, మమ్మల్ని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. వీరితో పాటు సర్వే నెంబర్ 27లో భూములున్న కుటుంబాలు వారు ఎస్పీని కలిసేందుకు ఆఫీసుకు వెళ్లారు.

తాజా వార్తలు

➡️