రైతు బంధు సాయం అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ

తెలంగాణ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ … కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నియమాలు ఉల్లంఘించారంటూ … రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. ఈనెల 28లోపు రైతుబంధు ఇచ్చేందుకు మూడురోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. రైతు బంధు ద్వారా అన్నదాతలకు ఆర్థిక సాయం అందనున్న నేపథ్యంలో … ఈసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రైతు బంధు సాయం పంపిణీకి అనుమతిని ఉపసంహరించుకుంది.

తాజా వార్తలు

➡️