‘నాగార్జునసాగర్ ‘ఘర్షణను వెంటనే కట్టడి చేయాలి : సిపిఎం

Nov 30,2023 11:54 #AP vs TS, #cpm, #Dispute, #Water Problem
cpm vsr comments on nagarjuna sagar dispute

ప్రజాశక్తి-విజయవాడ : నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణపై సిపిఎం స్పందించింది. ఘర్షణను వెంటనే కట్టడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఘర్షణను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరువు ప్రాంతాలకు నీరు పంపేందుకు న్యాయంగా ఆంధ్రాకు రావాల్సిన నీరును తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

➡️