హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంత్యక్రియలు

Nov 29,2023 16:09 #Anantapuram District
tdp leader cremation

ప్రజాశక్తి-పుట్లూరు : శింగనమల నియోజకవర్గము, యల్లనూరు మండలంలోని మేడికుర్తి గ్రామంలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కురబ మల్లికార్జున (36) అంత్యక్రియలు కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ బుధవారం పాల్గోని, కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రావణి శ్రీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో వైసీపీ నాయకులు, మద్దత్తుదారులు భూకబ్జాలకు పాల్పడుతూ, అడ్డు వచ్చిన బడుగు బలహీన వర్గాలకు చెందినవారిని హత్యలు చేయడమేన వైసీపీ సామాజిక సదస్సులని ప్రశ్నించారు. రాష్ట్రంలో ని ప్రజల ప్రాణాలు కాపాడవలసిన వైసీపీ ప్రభుత్వం, ధన దాహంతో కక్ష్య, హత్యా రాజకీయాలు చేస్తోందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో చేస్తున్న విధ్వంసక పరిపాలనను వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు ద్వారా అంతమొందించాలని ప్రజలకు తెలిపారు. మల్లికార్జున కుటుంబానికి టీడీపీ పార్టీ తరపున అండగా ఉంటామని బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు.

తాజా వార్తలు

➡️