జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు

Nov 27,2023 15:26 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిసెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో సబ్ జూనియర్, క్యాడిట్ జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరం జిల్లా నుండి 12 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 18, 19 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జిల్లాకి చెందిన పునీత్, కుశాల్, సాహిత్య సంకీర్తన, సాత్విక్, ముఖేష్ నిత్యశ్రీ, చరిష్మా, శృతి, దేవన్, హర్షిని, కమల్ రాష్ట్రం తరపున జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు. వీరికి జిల్లా తైక్వాండో అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్ వేణుగోపాలరావులు, కోచ్ లు గగన్, యశస్విని, చైతన్య, గౌతమ్ అభినందనలు తెలిపారు. విజయం సాధించి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

తాజా వార్తలు

➡️