సామాజిక బస్సుయాత్ర పేరిట భారీ వాహనాలు నిలుపుదల

Nov 24,2023 15:33 #srikakulam
heavy vehicles stop due to samajika yatra

ప్రజాశక్తి-పాలకొండ : మన్యం జిల్లా పాలకొండలో ఈరోజు సాయంత్రం వైసీపీ సామాజిక బస్సు యాత్ర జరగనున్నది. గురువారం రాత్రి నుండి పాలకొండలో మెయిన్ రోడ్డుపై సభ నిర్వహించే స్థలంలో కుర్చీలు టెంట్లు ఏర్పాటు చేయడంతో ఆమదాలవలస పురపాలక సంఘ పరిధిలోని తిమ్మాపురం వద్ద నున్న పార్వతీశంపేట జంక్షన్ వద్ద పోలీసులు గురువారం అర్ధరాత్రి నుండే లారీలు భారీ వాహనాలను నిలుపుదల చేశారు. పార్వతీశంపేట జంక్షన్ నుండి బొడ్డేపల్లి పేట జంక్షన్ వరకు వాహనాలు బారులు తీరాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వివిధ పనులపై వెళ్లే వాహనదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న బస్సులు ఇతర వాహనాలను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. సభల కోసం ప్రధాన రహదారులను మూసివేసి ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు కలిగించడమేమిటని పలువురు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

➡️